క్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున

క్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున

యెవరు చేరెదరో వారే ధన్నులు పరలోకమే వారిది

1.ప్రభుని వాక్యమును సంతోషముతో -ఎవరు స్వీకరింతురో

ప్రకటించెదరు తమ ఐక్యతను- బాప్తిస్మమునందున (క్రీస్తేసు)

2.అపొస్తలుల బోధను నమ్మి- స్థిరపరచబడిన వారే

ఆత్మశక్తితో వారు యెల్లపుడు- సంఘములో నిలచెదరు (క్రీస్తేసు)

3 పరిశుద్దులతో సహవాసమును- ఎవరు కలిగియుందురో

వారే పోందెదరు క్షేమాభివృద్ది- క్రిస్తేసు ప్రభువు నందు (క్రీస్తేసు)

4.ప్రభుదేహరక్తమును తినిత్రాగువారే- తలయందు నిలచెదరు

ప్రకటించెదరు ఆయన మరణ- పునరుత్థానమున వారు (క్రీస్తేసు)

5. పట్టువదలక సంఘముతో కూడి- ఎవరు ప్రార్థించెదరో

ప్రార్థన ద్వారా సాతాను క్రియలు – బంధించెదరు వారే (క్రీస్తేసు)

6.క్రిస్తేసు ప్రభుని రాకడ కొరకు- ఎవరెదురు చూచెదరో

 

నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు-సర్వలోకమునందు(క్రిస్తేసు)